కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జాతిని ఐక్యం చేసే యోచనలో భాగంగా ప్రధాని చేపట్టిన జనతా కర్ఫ్యూకి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఇదే స్పూర్తితో ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించే వినూత్న కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చీకటిలో దీపాల కాంతులలో కరోనా రాకాసిని ప్రారదోలడానికి చిహ్నంగా 130 మంది కోట్ల ప్రజలంతా సంఘటితంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ మహత్తర కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. ఆయన పిలుపు మేరకు సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు సైతం మద్దతు ప్రకటిస్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించే కార్యక్రమానికి సన్నద్ధం అవుతున్నారు. మరోవైపు మోడీ తీసుకున్న లైట్లు ఆపడం.. దీపాలు వెలిగించే నిర్ణయంతో జోకులు పేలుతున్నాయి. కరోనా వైరస్ని తరిమికొట్టడానికి లైట్లు ఆర్పడానికి.. మళ్లీ దీపాలు వెలిగించడానికి సంబంధం ఏంటి అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు పోస్ట్లు పెడుతున్నారు. కొంతమంది అయితే ప్రధానిని ట్రోల్ చేస్తూ ఫన్నీ మీమ్స్ వదులుతున్నారు. ఈ తరుణంలో హీరోయిన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘న్యూ టాస్క్ హియర్ (కొత్త టాస్క్ వచ్చేసింది) ఎయ్.. ఎయ్.. ఎయ్’ అంటూ ట్వీట్ చేసింది తాప్సీ. నాలుగు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న తాప్సీ.. మోడీ నిర్ణయంపై చేసి ఈ ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఏడువేలకు పైగా రీట్వీట్స్ రాగా.. 60 వేల మంది ఈ ట్వీట్ను లైక్ చేశారు. ఆమె ఏ ఉద్దేశంతో చేసిందో తెలుపలేదు కాని.. చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39OzOk1
v
No comments:
Post a Comment