అద్దాంతరంగా వచ్చిన ఈ కరోనా మహమ్మారి.. తీరని శోకాలని మిగల్చకూడదని.. ప్రాణనష్టం జరగకూడదని.. అహర్నిసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమిస్తూనే ఉన్నాయి. నిరవదిక లాక్ డౌన్స్ ప్రకటిస్తూ ప్రజలకు రక్షణగా, అండగా ఉంటామంటున్నాయి. ఓ పక్క పోలీసులు, వైద్యులు, పారిశుద్యకార్మికులు ఇళ్లకు దూరమై దేశ రక్షణకు పోరాడుతున్నారు. అందుకు మేము సైతం అంటున్నారు సెలబ్రెటీస్. తోచినంత సాయం చేసి.. ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఈ రోజు(ఏప్రిల్ 22) జీవిత, రాజశేఖర్ల రెండో కుమార్తె 'దొరసాని' సినిమాతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు శివాత్మిక. అలాగే, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కూడా మరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ రోజు ఉదయం రాజశేఖర్ కుమార్తెలిద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ ‘కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి, ఈ కష్ట సమయంలో మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం, ప్రజలందరూ బయటికి రాకుండా, తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాం. స్టే హోమ్. స్టే సేఫ్’ అని అన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3apTfQp
v
No comments:
Post a Comment