Sunday, 26 April 2020

తల్లి అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన నటుడు.. వీడియో కాల్ ద్వారా చివరిచూపు

కన్నతల్లి కన్నుమూసినప్పుడు ఆమె పక్కన లేకపోవడం, ఆమె చివరిచూపు దక్కలేకపోవడం కన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఇలాంటి దురదృష్టమే ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను వెంటాడింది. లాక్‌డౌన్ కారణంగా తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు ఇర్ఫాన్. ఆయన తల్లి సయీదా బేగమ్ అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలను జైపూర్ శివార్లలోని చుంగి నక శ్మశాన వాటికలో శనివారం సాయంత్ర జరిగాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ఇర్ఫాన్ పాల్గొనలేకపోయారు. దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఆయన ముంబై నుంచి రాజస్థాన్ వెళ్లలేని పరిస్థితి. దీంతో, కొంత మంది కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ అంత్యక్రియలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇర్ఫాన్ ఖాన్ వీక్షించారు. తన తల్లి చివరిచూపును వీడియో కాల్‌లో చూసుకున్నారు. కాగా, ఏఎన్ఐ రిపోర్ట్స్ ప్రకారం సయీదా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం కారణంగా ఆమె సహజ మరణం పొందారు. రాజస్థాన్‌లోని టాంక్ నవాబ్ ఫ్యామిలీకి చెందిన సయీదా.. జైపూర్‌లోని బెనివాల్ కాంటా కృష్ణ కాలనీలో స్థిరపడ్డారు. ఇదిలా ఉంటే, ఇర్ఫాన్ 2018 మేలో క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. లండన్‌లో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న ఆయన ఆ మహమ్మారి నుంచి కోలుకుని ఇటీవల భారత్ చేరుకున్నారు. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో ‘సైనికుడు’ సినిమాలో నటించారు. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా చేశారు. ఆయన తాజాగా నటించిన ‘అంగ్రేజి మీడియం’ మార్చి 13న విడుదలైంది. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yKyEsK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...