కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి పూటగడవని పేదవారికి ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. లబ్దిదారులకు బియ్యం, పప్పు వంటి నిత్యావసరాలు అందించడమే కాకుండా ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాయి. అలాగే, స్వచ్ఛంద సంస్థలు, చారిటీల ద్వారా కూడా పేదలకు సహాయం అందుతోంది. అయితే, ఈ సహాయాలేవి మధ్యతరగతి కుటుంబాలకు అందని పరిస్థితి. వారు కూడా గొంతెత్తి అడగలేరు. అందుకే, వాళ్లను ఆదుకోవడానికి హీరో విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. ఈ క్లిష్టపరిస్థితిలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక, నిత్యావసరాలు కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతోన్న మధ్యతరగతి కుటుంబాలకు అండగా ఉండేందుకు ‘మిడ్ క్లాస్ ఫండ్’ను ఏర్పాటుచేశారు. రూ.25 లక్షల నిధిని సమకూర్చారు. ఈ ఫండ్ ద్వారా అవసరమైన మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు. ఒక కుటుంబానికి రూ.1000 వరకు విలువ చేసే నిత్యావసరాలను కొనుగోలుచేసి ఇవ్వనున్నారు. Also Read: దీనికి చేయాల్సిందల్లా https://ift.tt/2W0QO1k వెబ్సైట్లో వివరాలను అందజేయడమే. అయితే, ఇది తాను చేస్తున్న సహాయం మాత్రమేనని. రేపు పరిస్థితులు చక్కబడిన తరవాత సహాయపొందినవారు తమకు వీలైతే మళ్లీ ‘ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్’కు విరాళం ఇవ్వొచ్చని విజయ్ కోరారు. దీని వల్ల మరికొంత మందికి సహాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. కాగా, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. విజయ్ దేవరకొండ ఎప్పుడూ కొత్త ఆలోచిస్తారని, ఈసారి ఎవ్వరూ పట్టించుకోని మిడిల్ క్లాస్ గురించి ఆలోచించారని సోషల్ మీడియాలో అభిమానులు కొనియాడుతున్నారు. Also Read: ఇదిలా ఉంటే, విజయ్ స్థాపించిన మిడిల్ క్లాస్ ఫండ్కు తొలిసారిగా మరో హీరో విరాళం ఇచ్చారు. ఆయనెవరో కాదు.. ‘RX 100’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కార్తికేయ. ఆయన లక్ష రూపాయల విరాళాన్ని MCFకు అందజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘మాటల్లేవ్ విజయ్ దేవరకొండ అన్న. నీ నిర్ణయానికి వందనం. మధ్యతరగతి వారు ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగం మన ముందు ఉన్న అతిపెద్ద సవాలు. నా వంతుగా MCFకు రూ.1 లక్ష అందజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమకు తోచినంత విరాళం ఇవ్వాలని విన్నవిస్తున్నాను’’ అని కార్తికేయ పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cOYsTj
v
No comments:
Post a Comment