వీళ్లకి ఇదేం పోయేకాలమో కాని.. పగలూ రాత్రి కష్టపడి ప్రాణాలను త్యాగం చేసి కరోనా పేషెంట్లకు ప్రాణం పోస్తున్న డాక్టర్లపై దాడులకు ఎగబడుతున్నారు కొంతమంది. ఇక మరికొంతమంది అయితే హాస్పటల్కి వెళ్లివస్తున్నారనే కారణంతో వాళ్లకు ఎక్కడ కరోనా సోకుతుందనే కారణంతో డాక్టర్లతో బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ఇక హాస్పటల్లో కరోనా సోకిన పేషెంట్లు సైతం డాక్టర్లను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డాక్టర్లని తిట్టడం.. కొట్టడం.. వాళ్లపై ఉమ్మడం, తుమ్మడం లాంటి అకృత్యాలకు తెగబడుతున్నారు. ఈ తరుణంలో ఓ సంచలన పోస్ట్తో పౌర హక్కుల సంఘాలను ఏకిపారేశారు దర్శకుడు . సోషల్ ఇష్యూస్పై ఫైరింగ్ ట్వీట్లు వదిలే హరీష్ శంకర్.. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లకు బాసటగా నిలిచారు. ప్రాణాలకు తెగించి.. కరోనా పేషెంట్లకు ప్రాణాలు పోస్తున్న డాక్టర్లపై దాడులకు ఎగబడున్న వారిపై నిప్పులు చెరుగుతూ ట్వీట్ వదిలారు. తాజాగా హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వైద్యులపై కూడా దాడులు జరగడంతో ఈ ఇష్యూని ప్రస్తావిస్తూ ఫైర్ అయ్యారు హరీష్ శంకర్. ‘డాక్టర్లు, నర్సులు, పోలీస్లు, పౌరులు మానవులు కాదా? నిన్న జరిగిన సంఘటనలపై పౌరహక్కుల సంఘాలు.. మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు! సజ్జనార్ సార్ను కడిగేయడానికి మాత్రం.. తోసుకుంటూ ముందుకొస్తారు’ అంటూ పౌర మానవ హక్కుల సంఘాలపై తన బాణాన్ని ఎక్కుపెట్టారు హరీష్ శంకర్. కాగా దిశా ఘటనలో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసి సంచలనానికి తెరతీసిన సజ్జనార్ తనదైన శైలిలో డిసిషన్ తీసుకుంటేనే ఇలాంటి పరిస్థితులు అదుపులోకి వస్తాయని.. డాక్టర్లపై దాడులు చేసేవాళ్లు భయపడతారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UXsqxg
v
No comments:
Post a Comment