మ్యాచో హీరో గోపీచంద్ తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా కష్టాలు పడుతున్న రెండు వేల కుటుంబాలకు నిత్యావర వస్తువులను అందజేసిన ఆయన.. తాజాగా చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తోన్న కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. కరోనా వైరస్ దెబ్బకు షూటింగ్లు నిలిచిపోవడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న దినసరి వేతన కార్మికులను ఆదుకోవడానికి తన వంతు చేయూతను అందించడానికి ఆయన ముందుకు వచ్చారు. గోపీచంద్ వితరణ ఇంతటితో ఆగలేదు. రోజూ 1500 మంది అనాథలకు రెండు నెలల పాటు ఆయన అన్నదానం చేస్తుండటం విశేషం. కాగా, గోపీచంద్ చేస్తోన్న ఈ మంచి పనుల పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో గోపీచంద్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేవలం సినీ కార్మికుల గురించే కాకుండా పేదలు, అనాథల గురించి కూడా ఆలోచించి, వారికి సాయం చేయడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు. Also Read: ఇక గోపీచంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయనకి గడ్డుకాలం నడుస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఆయనకి సరైన హిట్ పడలేదు. వరుస డిజాస్టర్లతో డీలాపడ్డారు. కిందటేడాది వచ్చిన ‘చాణక్య’ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమా స్పై థ్రిల్లర్ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ప్రస్తుతం గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే ‘గౌతమ్ నంద’ సినిమా వచ్చింది. ఇది రెండోది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yvVjJg
v
No comments:
Post a Comment