కామెడీ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ను సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ సినిమాల్లో అల్లరి నరేష్ నటన అద్భుతం. చాలా కాలం తరవాత కిందటేదాది ‘మహర్షి’ సినిమాలో మళ్లీ సహాయనటుడిగా కనిపించారు నరేష్. మహేష్బాబు 25 సినిమా అయిన ‘మహర్షి’లో ఆయన స్నేహితుడిగా నటించారు. సుమారు రూ.90 కోట్ల బడ్జెట్తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద రూ.175 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. కాగా, ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించిన అనుభవాలను తాజాగా అల్లరి నరేష్ పంచుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్తో మాట్లాడారు. ‘‘మహేష్ అద్భుతమైన నటన గురించి ప్రతిఒక్కరికీ తెలుసు. కానీ, ఆయనతో కలిసి నటించిన తరవాత ఒక మనిషిగా ఆయన గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి. సినిమాలు, కుటుంబం గురించి తప్ప ఆయన వేరే విషయం గురించి ఆలోచించరు, మాట్లాడరు’’ అని నరేష్ చెప్పుకొచ్చారు. Also Read: అంతేకాదు, మహేష్ బాబు తనను సార్ అని పిలిచేవారని చెప్పారు అల్లరి నరేష్. ‘‘సెట్స్లో మహేష్ బాబు నన్ను సార్ అని పిలిచేవారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. నన్నేకాదు.. లైట్ బోయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ప్రతి ఒక్కరినీ ఇంతే మర్యాదగా, గౌరవంగా పిలుస్తారు’’ అని టాలీవుడ్ ప్రిన్స్ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు నరేష్. Also Read: ఇక నరేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘నాంది’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని విధంగా ఈ సినిమాలో నరేష్ కనిపించనున్నారు. ఈ సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. విజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్తో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ లాక్డౌన్ సమయంలో తమ సినిమాకు పనిచేస్తోన్న రోజువారీ వేతన కార్మికులు ఇబ్బంది పడకూడదని నరేష్, సతీష్ వేగేశ్న కలిసి ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందజేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KyArE1
v
No comments:
Post a Comment