ప్రస్తుతం కరోనా విలయతాండవం జనాల్లో వణుకు పుట్టిస్తుంటే, ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చేదువార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ నటి, రంగస్థల కళాకారిణి (75) మరణం సినీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. దక్షిణ కోల్కతాలో నివాసముంటున్న ఆమె గురువారం గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. తన ఫ్లాట్లో ఉషా గంగూలీ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్స్ తెలిపారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఉషా గంగూలీ మరణవార్త తెలిసి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇతర కుటుంబ సభ్యులు తమ సంతాపం తెలియజేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉషా గంగూలీ మరణవార్త తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆమె మరణం నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. నాటక రంగంలో ఆమెకు ఆమే సాటి. ఏ లోకంలో ఉన్నప్పటికీ ఆమె శాంతి చేకూరాలి అని షబానా ఆజ్మీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కొందరు కుటుంబ సభ్యుల మధ్య ఆమె అంత్యక్రియలు ముగిశాయి. జోధ్పూర్లో జన్మించిన ఉషా గంగూలీ.. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకొని హిందీ సాహిత్యం నేర్చుకోవడానికి కోల్కతాకు వచ్చారు. ఆ సమయంలోనే నాటక రంగంలో ప్రవేశించి మహాభోజ్, రుడాలి, కోర్ట్ మార్షల్స్, ఆంతర్యాత్ర లాంటి నాటకాల్లో నటించి టాలెంట్ బయటపెట్టారు. ఆ తర్వాత ముఖ్తి, మానసి లాంటి సొంత ప్రొడక్షన్ హౌస్లను కూడా స్థాపించిన ఆమె అజయ్ దేవగణ్, ఐశ్వర్యరాయ్ నటించిన రెయిన్ కోట్ చిత్రానికి దర్శకురాలు రితుపర్ణో ఘోషతో కలిసి కథా సహకారం అందించారు. ఈ సినిమాకు నేషనల్ ఫిలిం అవార్డు కూడా దక్కింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2x53VWR
v
No comments:
Post a Comment