Wednesday, 4 March 2020

Chiranjeevi: ‘ఆచార్య’లో మహేష్.. చిరుకి ఇష్టంలేదట

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘ఆచార్య’. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇందులో సూపర్‌స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసిందే. దాదాపు మహేష్ పాత్ర ఖరారు అయిపోయింది. ఇక సినిమా టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే ఆలస్యం. ఈ సినిమా కోసం మహేష్ దాదాపు 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట. అంతేకాదు మహేష్‌కు దాదాపు 30 నుంచి 35 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమాలో మహేష్ నటించడం చిరంజీవికి ఇష్టంలేదట. అలాగని మహేష్, చిరుకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని కాదు. ఈ సినిమాకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాంటప్పుడు సినిమాలో మహేష్ బాబుకు 30 కోట్లు ఇచ్చే బదులు రామ్ చరణ్‌నే పెట్టచ్చు కదా అన్నది చిరంజీవి ఆలోచన. ఇదే విషయం గురించి కొరటాలతో కైడా డిస్కస్ చేసారట. మరోపక్క రామ్ చరణ్ ‘RRR’ సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి.. అందులో నటిస్తూనే ‘ఆచార్య’లోనూ నటించాలంటే కుదరని పని. అందుకే ఓసారి ‘RRR’ షెడ్యూల్ ఇంకా ఎంత వరకు ఉందో నిర్మాత దానయ్యతో మాట్లాడమని చిరు చెర్రీతో మాట్లాడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. READ ALSO: అంతేకాదు రామ్ చరణ్ తన ‘RRR’ షూటింగ్ పూర్తి చేసుకునే వరకు ఎదురుచూడాలని చిరు కొరటాలతో చెప్పారట. అంతేకాదు సినిమాను ‘RRR’ తర్వాతే రిలీజ్ చేయాలని కోరారట. ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు గెస్ట్‌గా వెళ్లిన చిరు... పొరపాటున తన సినిమా టైటిల్ ‘ఆచార్య’ అని ప్రకటించేసిన సంగతి తెలిసిందే. టైటిల్ ఆడియన్స్‌కి తెలుసు అని చిరు అనుకున్నారట. అందుకే ఆచార్య అని చెప్పేసారట. ఆ తర్వాత కొరటాల శివకు సారీ కూడా చెప్పారు మెగాస్టార్. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VKIc0b
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...