తన తోటి హీరోలంతా ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం దీని జోలికి రాలేదు. అప్పుడెప్పుడే ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసిన చరణ్.. కిందటేడాది జూలైలో ఇన్స్టాగ్రామ్లో చేరారు. అయితే, ఇప్పుడు ఆయన ట్విట్టర్లో కూడా అకౌంట్ తెరిచారు. ఉగాది రోజున మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా చేరిన విషయం తెలిసిందే. తన తండ్రి ట్విట్టర్ అకౌంట్ తెరిచిన తరవాతే రోజే రామ్ చరణ్ ట్విట్టర్లో చేరడం విశేషం. ఇదే విషయాన్ని చిరంజీవి ప్రస్తావించారు. ట్విట్టర్లో చేరిన చరణ్కు చిరంజీవి స్వాగతం చెబుతూనే ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘ ట్విట్టర్ ప్రపంచంలోకి రామ్ చరణ్కు స్వాగతం. సింహాన్ని దాని పిల్ల ఫాలో అవుతుంది’’ అని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు. ఇంకేముంది.. ఈ ట్వీట్కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ట్విట్టర్లో చేరిన రామ్ చరణ్ తన తొలి ట్వీట్తోనే అందరినీ కట్టిపడేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు, కరోనా నిర్మూలనా చర్యలకు రూ.70 లక్షలు విరాళమిస్తున్నట్లు ప్రకటిస్తూ చరణ్ తొలి ట్వీట్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. ఇలాంటి సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు 70 లక్షల రూపాయలను అందిస్తున్నాను. కోవిడ్ 19 నివారణకు గౌరవనీయులైన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారు, మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. బాధ్యత గల పౌరుడిగా ప్రభుత్వాలు సూచించిన నియమాలకు కట్టుబడి ఉండాలని ప్రజలకు సూచిస్తున్నాను’’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు రామ్ చరణ్. రూ. 70 లక్షలు విరాళం ఇచ్చిన రామ్ చరణ్కు తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QK6Wm2
v
No comments:
Post a Comment