దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ మన దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు స్ఫూర్తిగా నిలిచింది. ‘బాహుబలి’ తరవాతే దక్షిణాది నుంచి పాన్ ఇండియా మూవీలు ప్రారంభమయ్యాయి. భారీ బడ్జెట్తో సినిమాలు తీసినా మార్కెట్ చేయగలమనే ధైర్యాన్ని ‘బాహుబలి’ సినిమా మన సౌత్ స్టార్లకు, నిర్మాతలకు ఇచ్చింది. ‘బాహుబలి’ ఇచ్చిన స్ఫూర్తితోనే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాను తీశారు. ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ భారీ పాన్ ఇండియా చిత్రంతో వస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరక్కార్’ మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్లాల్ ప్రధాన పాత్రలో మలయాళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో మార్చి 26న విడుదలవుతోంది. ‘అరేబియా సముద్ర సింహం’ అనేది ఈ చిత్ర టైటిల్కు ట్యాగ్ లైన్. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం అన్ని భాషల్లోనూ ట్రైలర్ను విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇక తమిళ ట్రైలర్ను సూర్య, కన్నడ ట్రైలర్ను యశ్, హిందీ ట్రైలర్ను అక్షయ్ కుమార్ లాంచ్ చేశారు. Also Read: కాగా, ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. మోహన్లాల్ తనయుడు ప్రణవ్, యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, ఫాజిల్, సిద్ధిఖి, నేదుముడి వేణు, ఇన్నోసెంట్, అశోక్ సెల్వన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆశిర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటొని పెరుంబవూర్ ఈ సినిమాను నిర్మించారు. రోనీ రాఫెల్ సంగీతం సమకూర్చారు. ‘బాహుబలి’కి పనిచేసిన సాబు సిరిల్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్. తిరు సినిమాటోగ్రఫీ అందించారు. అయ్యప్పన్ నాయర్ ఎడిటర్. అంకిత్ సూరి, రాహుల్ రాజ్, లయెల్ ఎవాన్స్ రోడెర్ (లండన్) నేపథ్య సంగీతం అందించారు. Also Read: 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కుంజలి మరక్కార్ జీవిత కథ ఆధారం. దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. 1996లో వచ్చిన ‘కాలాపానీ’ చిత్రం అనంతరం సుదీర్ఘ విరామం తరువాత ప్రియదర్శన్, మోహన్లాల్, ప్రభు కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. See Photo Story:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3awaAr3
v
No comments:
Post a Comment