సంగీత దర్శకుడు తమన్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్తో తమన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘సామజవరగమన’ సాంగ్ ఇంటు తమన్, అటు సింగర్ సిద్ శ్రీరామ్కు గొప్ప పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సాంగ్ సంచలనం సృష్టించడానికి వస్తుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో కావడం విశేషం. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అక్కడ అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తు్న్నారు. తాప్సి పాత్రలో నివేదా థామస్ నటిస్తున్నారు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే విడులైన ఈ సినిమా ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి పాట వస్తోంది. Also Read: ‘మగువా మగువా’ అంటూ సాగే ఈ పాటను ఈనెల 8న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తు్న్నారు. అయితే, శుక్రవారం ఈ పాట ప్రోమోను లాంచ్ చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా’ అనే లిరిక్ను ప్రోమోలో వినిపించారు. ఈ రెండు లైన్లు వింటుంటే ఇది మహిళ గొప్పతనాన్ని చాటే పాట అని అర్థమవుతోంది. ఇలాంటి పాట పవన్ సినిమా నుంచి.. అందులోనూ సిద్ శ్రీరామ్ స్వరం నుంచి జాలువారితే సెన్సేషన్ కాక ఇంకేమవుతుంది. 8వ తేదీన మరికొన్ని కొత్త రికార్డుల కోసం వేచి చూడండి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xh6pkL
v
No comments:
Post a Comment