ఒకప్పుడు తెలుగు సినిమాల్లో భయంకరమైన విలన్గా పేరొందిన తమిళ నటుడు ఆనందరాజ్ తమ్ముడు కనగసభాయ్(49) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. పుదుచ్చేరిలో ఉంటోన్న నివాసముంటోన్న కనగసభాయ్ తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. అరటి పండుకు పురుగుల మందు పూసుకుని తిని ఆత్మహత్య చేసుకున్నారు. కనగసభాయ్ పెళ్లి చేసుకోలేదు. తల్లిదండ్రుల మరణం అనంతరం తన పూర్వీకుల ఇంటిలోనే ఒంటరిగా నివాసముంటున్నారు. ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. కనగసభాయ్ చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నారని.. దానిలో భారీ నష్టం రావడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కనగసభాయ్ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ చిట్ ఫండ్ కంపెనీకి రూ. 50 కోట్ల వరకు నష్టం వచ్చిందట. దీంతో తమ డబ్బు తిరిగిచ్చేయాలని వారందరి నుంచి కనగసభాయ్పై ఒత్తిడి పెరిగిందని.. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. కనగసభాయ్ తన సూసైడ్ నోట్లో కూడా కంపెనీకి రూ.50 కోట్ల నష్టం వచ్చినట్టు పేర్కొన్నారని సమాచారం. Also Read: ఇదిలా ఉంటే, తన తమ్ముడి మరణంపై ఆనందరాజ్ స్పందించారు. అసలు తన తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి కంపెనీ నష్టాలు కారణం కాదన్నారు. ‘‘నా తమ్ముడికి వ్యాపారంలో ఎలాంటి నష్టం రాలేదు. కానీ, ఒకరి నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. ఇటీవలే కనగసభాయ్ ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి విషయంలో కొంతమంది నా తమ్ముడిని బాగా ఇబ్బంది పెట్టారు. తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితులను వదలడానికి వీల్లేదు. దీనిపై లోతైన విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నానని’’ అని ఆనందరాజ్ చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TLW6N3
v
No comments:
Post a Comment