Sunday, 22 March 2020

వైద్యులకు టాలీవుడ్ వందనం: రామ్ చరణ్ చప్పట్లు.. గంటకొట్టిన ఎన్టీఆర్

దేశ ప్రజల భద్రత కోసం కరోనా వైరస్‌‌‌తో పోరాడుతూ రాత్రింబవళ్లు కష్టపడుతోన్న వైద్య సిబ్బంది, పోలీసులు, జవాన్లకు సంఘీభావంగా ఆదివారం సాయంత్రం దేశ ప్రజలంతా తమ ఇళ్లలో నుంచే చప్పట్లు, గంటలు కొట్టారు. హైదరాబాద్‌లో తెలుగు సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఇళ్లలో నుంచే చప్పట్లు కొట్టారు. గంటలు మోగించారు. ఈ వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇంటి బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రతి ఒక్కరీ బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు అభయ్ రామ్‌తో కలిసి తన ఇంట్లో ఉన్న గంటను మోగించారు. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన ఇంట్లో గంటను మోగించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. హీరో మంచు మనోజ్ బాల్కనీలో నుంచి చప్పట్లు కొట్టారు. వందేమాతరం అంటూ నినదించారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంతో కలిసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి చప్పట్లు కొట్టారు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి తమ ఆఫీసు ఆవరణలో నిలబడి చప్పట్లు కొట్టారు. పూరీ జగన్నాథ్ తన స్టైల్లో ‘నీ అయ్య కరోనా’ అంటూ అరుస్తూ క్లాప్స్ కొట్టారు. వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబు, తల్లి పద్మజ, చెల్లెలు నిహారికతో కలిసి చప్పట్లు కొట్లారు. హీరోయిన్ పూజా హెగ్డే ముంబైలోని తన ఇంటి బాల్కనీలో నిలబడి చప్పట్లు కొట్టారు. ఆమె తండ్రి శంఖం ఊదారు. ఇంకా.. నిఖిల్ సిద్ధార్థ, తమన్నా, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ, గోపీచంద్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UpNdZW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...