Wednesday, 25 March 2020

పేద సినీ క‌ళాకారుల కోసం వి.వి.వినాయక్ విరాళం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా షూటింగ్స్ నిలిచిపోవ‌డంతో దిన‌స‌రి వేత‌నంతో బ‌తికే పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్స్ ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయ‌క్ త‌న వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చారు. న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్ ఆధ్వర్యంలో న‌డుస్తోన్న ‘మ‌నం సైతం’ ఫౌండేష‌న్‌కు రూ. 5 ల‌క్షలు అంద‌జేశారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి కూడా ఇబ్బందులు ప‌డుతున్న పేద సినీ క‌ళాకారులు, సాంకేతిక విభాగాల్లో ప‌నిచేసే కార్మికులు ‘మ‌నం సైతం’ను సంప్రదించి, వాటిని పొంద‌వ‌చ్చని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయ‌క్ వెల్లడించారు. ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘ఈరోజు అంద‌ర్నీ వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్‌ను మ‌న ఇళ్లల్లో మ‌నం ఉండి వ‌ణికించాలి. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని పేద క‌ళాకారులు, టెక్నీషియ‌న్లు, డాన్సర్లు, ఫైట‌ర్లు.. ఎవ‌రైనా కానివ్వండి, నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. వాళ్లకు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అంద‌జేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 ల‌క్షల చెక్కును మ‌నం సైతం కాదంబ‌రి కిర‌ణ్‌కుమార్‌కు అంద‌జేస్తున్నా. నిజంగా ఎవ‌రికి అవ‌స‌ర‌మో వారు కాదంబ‌రి కిర‌ణ్ గారిని సంప్రదించి, నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా’’ అని చెప్పారు. Also Read: నిరంత‌రం పేద సినీ క‌ళాకారుల సంక్షేమం కోసం ఆలోచిస్తోన్న ‘మ‌నం సైతం’ ఫౌండేష‌న్‌ను ఈ సంద‌ర్భంగా వినాయ‌క్ ప్రశంసించారు. అందుకే ఆ ఫౌండేష‌న్ ద్వారా త‌న వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. ఇదిలా ఉంటే, వి.వి.వినాయక్ హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు ‘సీనయ్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33LxEA7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...