Wednesday, 18 March 2020

తూ.గో జిల్లాలో కరోనా ఎఫెక్ట్.. థియేటర్స్ బంద్‌

ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీని తాకింది. ఇప్పటికే తెలంగాణలో థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. ఈనెల 31 వరకూ థియేటర్స్‌తో పాటు విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్ మూసివేయడంతో... వేలాది మంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. చాలా వరకూ సినిమా షూటింగ్స్ అన్నీ ఆపేశారు. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. చిన్న చిన్న సినిమాలన్నీ షూటింగ్‌లు రద్దు చేసుకున్నాయి. విడుదలైన సినిమాలకు కోట్లలో నష్టం జరగ్గా.. ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు ఒక్కొటిగా వాయిదా పడుతున్నాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్స్ యజమానులకు కోట్ల నష్టాన్ని మిగిల్చిన ఈ కరోనా ఎఫెక్ట్ సినిమా లవర్స్ ఎక్కువగా ఉండే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు తగిలింది. ఈ వ్యాధి అంతకంతకూ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్స్ మూసివేసేందుకు ఈస్ట్ గోదావారి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా తెలియజేస్తూ ఏలూరుకి చెందిన మెగా పీఆర్ఓ ఏలూరు శ్రీను ట్వీట్ చేశారు. కాగా నెల్లూరులో కరోనా కలకలం రేగడంతో ఇప్పటికే అక్కడ థియేటర్స్ అన్నీ బంద్ ప్రకటించాయి. మరికొన్ని జిల్లాల్లో స్వచ్ఛందంగానే థియేటర్స్‌ను మూసేస్తున్నారు థియేటర్స్ యజమానులు. మరి వ్యాధి ప్రబలే ప్రమాదం జనాల ఎక్కువగా ఉండే సినిమా థియేటర్స్‌లో ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్స్ బంద్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలంగాణతో పాటు.. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే సెలవులను ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b9BVQ7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...