Wednesday, 18 March 2020

కరోనా ఎఫెక్ట్ బర్త్ డే వేడుకలు వద్దన్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో చెర్రీ తన అభిమానులకు ఓ పిలుపునిచ్చాడు. మార్చి 27న . దీంతో మెగా అభిమానులంతా వేడుకలకు సిద్ధమవుతున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని తన అభిమానుల్ని కోరాడు. వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో గ్రూపులుగా తిరగడం, ఫంక్షన్లు పెళ్లిళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఇలాంటి సమయంలో తాను బర్త్ డే వేడుకలు చేసుకోవడం సరికాదని అంటున్నారు రామ్ చరణ్. అందుకే తన ఫ్యాన్స్‌కు కూడా ఇదే విషయాన్నికోరారు. తన పుట్టినరోజున ఎలాంటి సెలబ్రేషన్స్ చేయకుండా కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రామ్ చరణ్ ఈనెల 27న 35వ బర్త్ డే జరుపుకోనున్నారు. దీంతో ఆయన పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు ఇప్పటికే పలు ప్లాన్‌లు సిద్ధం చేశారు. ఇప్పటికే రామ్ చరణ్ పై పేయింటింగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు తన తోటి నటులకు మార్చి 26న గ్రాండ్‌ ఈవెంట్‌ చేసేందుకు ఆడిటోరియంను సైతం బుక్‌ చేసుకున్నారు. ఇంతలో రామ్‌చరణ్‌ తన పుట్టిన రోజు వేడుకలను విరమించుకోవాలని కోరుతూ అభిమానులకు లేఖ ద్వారా తెలిపారు. ‘నా మీద ఉన్న ప్రేమ.. నా పుట్టిన రోజుని పండగగా జరిపేందుకు మీరు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోగలను. కానీ మనం ఉన్న పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు జనం రద్దీ తక్కువగా ఉండేట్టు చూసుకోవడం మంచిది. అభిమానులంతా అధికారులకు సహకరించి వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. అదే మీరు నాకు ఈ ఏడాది ఇచ్చే అతి పెద్ద బర్త్ డే గిఫ్ట్’అని రామ్ చరణ్ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b4LiR9
v

No comments:

Post a Comment