Friday, 20 March 2020

నిర్భయ దోషులకు ఉరి.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ వైరల్

దేశ వ్యాప్తంగా దోషుల్ని ఉరి తీయడంపై హర్షం వ్యక్తం అవుతోంది. సామాన్య జనంతో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు ట్విట్టర్‌లో న్యాయం గెలిచింది అంటూ తమ స్పందనలు తెలియజేస్తున్నారు. సుస్మితాసేన్, ప్రీతి జింటా, రవితేజ, తమన్నా, తాప్సీ, మంచు మనోజ్, అనసూయ, పీవీపీ తదితరులు నిర్భయ హత్యాచారం కేసులో దోషులైన ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను ఉరి తీయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేయగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ సైతం స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘ఈ తీర్పు కోసం చాలా కాలంగా ఎదురుచేస్తున్నాం.. ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై గౌర‌వం పెరిగింది. నిందితులకు ఉరిశిక్ష పడటంతో న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కాన్ని మ‌రింత పెంచింది. నిర్భయ ఘటనలో న్యాయం కోసం పోరాటం చేసిన నిర్భ‌య త‌ల్లిదండ్రుల‌కు, న్యాయ‌వాదుల‌కు నా సెల్యూట్‌. భవిష్యత్‌లో ఇలాంటివి జరిగినప్పుడు తక్షణచర్యలు చేపట్టేలా బలమైన చట్టాలు ఉండాలి. ఇలాంటి తప్పు మళ్లీ చేయడానికి భయపడే విధంగా చట్టాలు ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. ఏడేళ్ల తరువాత నిర్భయదోషులకు ఉరితీయడం అన్నది నమ్మశక్యంకాని వార్తే. న్యాయం పోరాడిన నిర్భయ తల్లికి నా వందనం అంటూ మాస్ రాజా రవితేజ మరో ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3beUIK5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...