Friday, 20 March 2020

ఈపాటికి అమెరికాలో ఉండాల్సినదాన్ని: పునర్నవి ఆవేదన

తమ ప్రాజెక్టులు, సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు సమయం చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడపాలనుకుంటారు. తమకు ఇష్టమైన వ్యక్తుల వద్దకు వెళ్లి వేడుకలు చేసుకుంటూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్తుంటారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరోనా వైరస్ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో ఇంట్లోనే తమ కుటుంబాలతో గడుపుతున్నారు. అంతేకాకుండా ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అయితే, ఈ కరోనా వైరస్ వల్ల తానొక ముఖ్యమైన వేడుకను మిస్ అయ్యానని ఫీలవుతున్నారు బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం. తాను ఈ సమయంలో అమెరికాలో ఉండాల్సిందని.. కానీ, కరోనా వైరస్ వల్ల ఇక్కడే ఉండిపోయానని పునర్నవి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు అమెరికా ట్రిప్ గుర్తుకువస్తోంది. ఈ ఏడాది ఈ సమయంలో అక్కడ ఉండాలనుకున్నా. నా మేనల్లుడు రెండో పుట్టినరోజు వేడుకలను నా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నా. కానీ, ఇక్కడే ఉండిపోయా. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడాలని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేను’’ అని పునర్నవి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. Also Read: త్వరలోనే తన బంధువులను కలుసుకుంటేచాలని ఆశిస్తున్నానని పునర్నవి తెలిపారు. ఊపిరితిత్తులను తినేసే ఈ భయంకర వైరస్‌పై అందరూ కలిసి పోరాడాలని పునర్నవి పిలుపునిచ్చారు. జనసమూహాలకు దూరంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు ఒంటరిగా ఉండాలని సూచించారు. కిందటేడాది అమెరికాలోని మిచిగాన్‌లో తన కుటుంబంతో గడిపినప్పుడు తీసుకున్న ఫొటోలను ఈ పోస్ట్‌లో పునర్నవి పొందుపరిచారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/395T6kg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...