కరోనా వైరస్ మీద నెలకొన్న భయాందోళనల కారణంగా ప్రజలు ఎక్కువ సమయం ఇళ్లలోనే గడుపుతున్నారు. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. గంటలు గంటలు ఇంట్లోనే గడుపుతుండటంతో వాళ్లకు కూడా బోర్ కొడుతుంది కదా. ఎంతసేపని వాళ్లు టీవీలో వచ్చే కార్యక్రమాలు చూస్తారు. అలా అని పదే పదే ఆ కార్టూన్స్ చూసినా బోర్ కొడుతుంది. అందుకనే.. దేశవ్యాప్తంగా ప్రజలకు ఒక చక్కని కానుకను ఆఫర్ చేశారు. ఒక నెల రోజుల పాటు ఏసీకే (అమర్ చిత్ర కథ), టింకిల్ యాప్స్లోని కంటెంట్ను ఉచితంగా తిలకించవచ్చని ప్రకటించారు. ఆ రెండు యాప్స్ ఆయనవే. ఇవి కామిక్స్ యాప్స్. పిల్లలు బాగా ఇష్టపడతారు. ‘‘ఏసీకే విషయంలో ఈ నెలలో ఆన్లైన్ సభ్యత్వాలను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఏసీకే, టింకిల్ యాప్స్లోని అద్భుతమైన కంటెంట్ను పిల్లలు, పెద్దలు ఉచితంగా చూసుకోవచ్చు. వాటిలో తమకు ఇష్టమైన దాన్ని చదువుకోవచ్చు. అందులో ఉన్నవన్నీ మన ప్రాంతం కథలు. అవి చదివితే మన దేశం, మన దేవుళ్లు, రాజులు, సంస్కృతి గురించి తెలుస్తుంది. చక్కని బొమ్మలు, కథలతో అవి అలరిస్తాయి. మన గతం గురించి తెలుసుకొని, భవిష్యత్తును నిర్మించుకోవడానికి నేటి తరానికి ఇది చాలా ముఖ్యం’’ అని రానా చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో సినిమా సహా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం కార్యకలాపాల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనేక మంది సెలబ్రిటీలు కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన ‘అరణ్య’ చిత్రం విడుదలను వాయిదా వేసిన హీరో రానా దగ్గుబాటి.. సామాజిక దూరం పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bdSGKk
v
No comments:
Post a Comment