Wednesday, 4 March 2020

కొత్త ఛాలెంజ్ మొదలుపెట్టిన రానా.. ‘అరణ్య’ ప్రచారం కోసమేనా!!

ఒక సినిమాను నిర్మించిన తరవాత దానికి మంచి ప్రచారం కల్పిస్తేనే జనాల్లోకి వెళ్తుంది. ప్రచారం లేకపోతే ఆ సినిమా ఎప్పుడొచ్చిందో వెళ్లిందో కూడా ఎవ్వరికీ తెలీదు. అందుకే మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి అదే పనిలో ఉన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. అటవీ సందపను, మూగజీవాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ సినిమా వస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ టైటిల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర విశేషంగా ఆకట్టుకుంది. ‘అరణ్య’ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. అస్సాంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు అక్రమంగా కబ్జా చేసిన దురదృష్టకర ఘటనను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభు సాల్మన్ రూపొందించారు. Also Read: ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా మనకు కనిపించబోతున్నారు. ఇది పర్యావరణాన్ని కాపాడుకోవాలనే మెసేజ్‌తో వస్తోన్ని సినిమా కావడంతో ఆ దారిలోనే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు రానా. దీనికోసం సోషల్ మీడియాలో ‘ఈకో ట్రైబ్’ అనే ఛాలెంజ్‌ను మొదలుపెట్టారు. ఈ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించి ఒక మొక్కను నాటి ఆ వీడియోను #EcoTribe హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని కోరారు. ‘‘వాతావరణం చాలా దారుణంగా మారిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మనలో కొంత మంది ప్రయత్నిస్తున్నారు. కానీ, చాలా మంది దీన్ని పక్కనబెట్టేస్తున్నారు. ఈ పనిలో మీరూ పాల్గొనే సమయం వచ్చింది. ఒక మొక్కను నాటుతూ వీడియో తీసుకోండి. దాన్ని ఈకో ట్రైబ్ హ్యాష్ ట్యాగ్‌తో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయండి. నన్ను ట్యాగ్ చేయండి. మీ స్నేహితుడిని నామినేట్ చేయడం మరిచిపోవద్దు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రానా పేర్కొన్నారు. ఈ వీడియోలో ఆయన ఒక మొక్కను కూడా నాటారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PI98di
v

No comments:

Post a Comment