Wednesday, 11 March 2020

ఈ కథను మొదట నేను బన్నీకి చెప్పా: ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ దర్శకుడు

యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ తెరకెక్కిన చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఈ చిత్రం ద్వారా మున్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్.వి.బాబు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్‌లో బోలెడన్ని వ్యూస్ తెచ్చిపెడుతోంది. ఈ ఒక్క పాటతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు విడుదల చేస్తుండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఉగాది కానుకగా మార్చి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చిత్ర విడుదల తేదీని ప్రకటించడానికి బుధవారం హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో హీరో ప్రదీప్, హీరోయిన్ అమృత అయ్యర్, నటి శరణ్య, దర్శకుడు మున్నా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నిర్మాత బాబు, సహ నిర్మాత వినయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మున్నా మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను, ఈ సినిమా తెరకెక్కడం వెనుక ప్రధాన కారకులు ఎవరు అనే ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. Also Read: ‘‘గీతం కాలేజీలో నేను ఎంసీఏ చదువుతున్నప్పుడు నేను ఒక సినిమా చూశాను. ఆ సినిమా టిక్కెట్ నేను పర్సులో పెట్టుకుని ఎలాగైనా ఈ డైరెక్టర్ దగ్గర పనిచేయాలి అని అనుకున్నాను. ఎంత బలంగా అనుకున్నానంటే.. ఈ డైరెక్టర్ దగ్గర కచ్చితంగా నేను పనిచేస్తా అని నా ఫ్రెండ్‌తో చెప్పాను. కొన్నాళ్ల తరవాత అదే డైరెక్టర్ దగ్గర నేను పనిచేశాను. ఆయనెవరో కాదు.. సుకుమార్ గారు’’ అని మున్నా చెప్పుకొచ్చారు. తాను దర్శకుడిని కావడానికి కారణం సుకుమార్ అయితే.. ఈ సినిమా కథకు ఫస్ట్ ఆడియన్ అల్లు అర్జున్ అని మున్నా చెప్పారు. ‘‘అల్లు అర్జున్ గారంటే నాకు చాలా చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాల కిందట ఈ కథను తొలిసారి అల్లు అర్జున్ గారికి చెప్పాను. ఆయన నవ్విన నవ్వులు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఫుల్ క్లాప్స్ కొట్టి చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన అడిగిన ప్రశ్నల వల్ల స్క్రీన్‌ప్లే చాలా మారింది. ఆయన, బన్నీ వాసు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు స్క్రీన్‌ప్లే ఐడియాలు ఇచ్చారు. దగ్గరుండి నాచేత చిన్న పిల్లాడిలా రాయించారు. ఇప్పుడు జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నా సినిమాను రిలీజ్ చేస్తుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని మున్నా వెల్లడించారు. Also Read: సెన్సార్ బోర్డు సభ్యులు తమ సినిమాను చాలా మెచ్చుకున్నారని మున్నా చెప్పారు. సెన్సార్ బోర్డులో ఇద్దరు మహిళలు ఇలాంటి సినిమా గడిచిన మూడేళ్లలో చూడలేదని చెప్పారని మున్నా తెలిపారు. ‘‘ఒకరికి 35 ఏళ్లు, మరొక మహిళకు 55 ఏళ్లు ఉంటాయి. వారిద్దరూ తడిసిన కళ్లతో ఇలాంటి సినిమా మూడేళ్లలో చూడలేదు, చాలా బాగుంది అన్నారు. వాళ్లు అలా చెప్పగానే.. అసలు వాళ్లకు రివ్యూ ఇవ్వాల్సిన అవసరమేలేదు, వాళ్లే చెప్తే ఇంకెందుకు భయం అనిపించింది. ఇక ఆ తరవాత రివ్యూ బన్నీ వాసు ఇచ్చారు. ఆయన సినిమా చూసి నన్ను గట్టిగా హత్తుకుని.. మున్నా మనం రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. మా టీం అందరి తరఫున బన్నీవాసు గారికి, యూవీ క్రియేషన్స్‌కి చాలా చాలా థ్యాంక్స్’’ అని మున్నా ముగించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TTueGU
v

No comments:

Post a Comment