ఎన్టీఆర్ భార్యగా.. రాజకీయాల్లో లేడి డైనమిక్గా అందరి దృష్టిని ఆకర్షించిన లక్ష్మి పార్వతి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘రాధాకృష్ణ’ అనే చిత్రంతో కీలకపాత్రలో కనిపించబోతున్నారు . హరిని ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు డమరుకం శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో నిర్మాతలు పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో వుంది. ఈ చిత్రంలో సెల్ఫ్ మేడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. అనురాగ్, ముస్కాన్ శెట్టిలు జంటగా నటించారు. కనుమరుగు అవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలను చూపిస్తూనే ఒక అందమైన ప్రేమకథను అందరికి నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రసాద్ వర్మ. ఈ చిత్రంతో ఆయన టాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2v6vhuF
v
No comments:
Post a Comment