Tuesday, 18 February 2020

Mahesh Babu: విజయ నిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మహేష్

గతేడాది జూన్‌లో లెజండరీ దర్శకురాలు, నటి విజయ నిర్మాల కన్నుమూసారు. దాంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఫిబ్రవరి 20న ఆమె తొలి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. నానక్‌రామ్‌గూడలోని విజయనిర్మాల నివాసంలో విజయ నిర్మల విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహాన్ని సూపర్‌స్టార్ ఆవిష్కరించనున్నారట. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ సంతోష్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. గతేడాది జూన్ నెలలో విజయ నిర్మల అనారోగ్యంతో కన్నుమూసారు. తాను కోరుకున్నట్లుగానే గురువారం రోజున వెళ్లిపోయారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/327AqP7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...