కోవిడ్ () మహమ్మారికి యావత్ చైనా వణికిపోతోంది. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వ్యాధి ఇప్పటివరకు దాదాపు రెండే వేల మంది నిండుప్రాణాలను బలిగొంది. రెండు రోజుల క్రితం చైనాకు చెందిన ప్రముఖ దర్శకుడు చాంగ్ కాయ్, అతని తల్లిదండ్రులు, సోదరి మరణించారు. అతని భార్య చావుల బతుకుల మధ్యపోరాడుతున్నారు. చైనీస్ లూనార్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జనవరి 25న చాంగ్ కాయ్ తన కుటుంబీకులతో గెట్ టుగెదర్ ఏర్పాటుచేసారు. ఆ సమయంలో అంతా బాగా ఎంజాయ్ చేసారు. అదే సమయంలో వారు అనారోగ్యం పాలయ్యారు. వైద్యులను సంప్రదించగా కరోనా సోకినట్లు తెలిసింది. దాంతో వారిని వెంటనే ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడంతో ప్రాణాలు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు విడిచారు. చాంగ్ కుమారుడు యూకేలో చదువుకుంటున్నాడు. తన కుటుంబం మొత్తం కరోనాకు బలైపోయిందని తెలిసీ అతను ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రిని చివరిసారిగా చూసుకునే వీలు లేకుండా యూకే అధికారులు చాంగ్ కుమారుడిని చైనాకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. అతను వెళ్తే తనకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని, అతను మళ్లీ యూకేకు వస్తే అక్కడి వాసులకు కూడా వ్యాపిస్తుందని ప్రభుత్వం అనుమతించలేదు. చాంగ్ కాయ్కి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అతను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. READ ALSO: చైనాలో వైరస్ బారిన పడే వారు రోజురోజుకీ పెరిగిపోతుండడంతో హాస్పిటల్స్లో పేషెంట్స్ చేర్చుకోవడానికి జాగా లేకుండాపోయింది. దాంతో చాంగ్ కాయ్ను అతని కుటుంబీకులను ఏ హాస్పిటల్లోనూ ఉంచలేదని అతను బాధపడ్డాడు. నెల రోజుల క్రితం చైనీస్ ప్రభుత్వం ఆరు రోజుల్లో ఓ పెద్ద హాస్పిటల్ నిర్మించేసిన సంగతి తెలిసిందే. కానీ వ్యాధి తీవ్రంగా ముదిరిన వారికే అక్కడ చికిత్సకు అనుమతిస్తున్నారట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Hwjd8J
v
No comments:
Post a Comment