Sunday, 2 February 2020

‘పనీ పాటా లేనివారే బిగ్‌బాస్‌కు వెళ్లేది.. నేనూ అంతే’’

సెలబ్రిటీ రియాల్టీ షో ఇప్పుడు హిందీలోనే కాదు దక్షిణాది భాషల్లోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సినిమా అవాకాశాలు లేక సతమతమవుతున్నవారికి పారితోషికం ఇచ్చి బిగ్‌బాస్ హౌజ్‌‌లోకి పంపించి వారి చేత ఆటాడిస్తారు. అయితే బిగ్‌బాస్ దక్షిణాదికి కొత్త. ఎందుకంటే ఇక్కడ ఈ షో ప్రసారం అయ్యి మూడేళ్లే అవుతోంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఏకంగా 13 సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాగుతూ వస్తోంది. ఐదో సీజన్ నుంచి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే బిగ్‌బాస్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గి. సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నవారే బిగ్‌బాస్‌లోకి వెళ్తారని అంటోంది. ఈమె చెప్పింది నూటికి నూటి శాతం నిజమే కానీ ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావించిందో ఆమెకే తెలియాలి. ‘‘అమీషా పటేల్, కోయినా మిత్రా, రష్మీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా.. ఇలాంటి వారికి ఎలాంటి పని దొరకడం లేదు. అందుకే డబ్బు కోసం బిగ్‌బాస్ 13లో పాల్గొన్నారు. కొందరైతే డబ్బు ఇవ్వకపోయినా ఫర్వాలేదు షోలో కనిపించి నలుగురి కళ్లలో పడితే చాలు అనుకుంటున్నారు. నేను బిగ్‌బాస్ సీజన్‌ 2లో పాల్గొన్నప్పుడు నాకు కూడా ఎలాంటి అవకాశాలు రాలేదు’’ అని తెలిపారు. READ ALSO: అయితే బిగ్‌బాస్ షో తర్వాత చిత్ర పరిశ్రమలో సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. వారికి కూడా సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఓరకంగా చెప్పాలంటే బిగ్‌బాస్‌ కెరీర్‌ను ఏర్పరచుకోవడానికి ఓ అణువైన మార్గం అనే చెప్పాలి. తెలుగులో యాంకర్ శ్రీముఖి, నటి పునర్నవి భూపాలం, బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌లకు కూడా ఇప్పుడు అవకాశాలు బాాగా పెరిగిపోయాయ్. మొన్నటి వరకు రాహుల్ సిప్లిగంజ్‌ అంటే పెద్దగా ఎవ్వరికీ తెలీదు. కానీ అతను బిగ్‌బాస్ టైటిల్ గెలవగానే తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు మారుమోగిపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36TsZfn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...