Tuesday, 18 February 2020

నా చెల్లిని బెదిరించావ్, నువ్వు మోదీని అంటున్నావా: అక్క రంగంలోకి దిగింది

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి మళ్లీ రంగంలోకి దిగారు. ఆమె ప్రధాని నరేంద్ర మోదీ భక్తురాలు. బీజేపీకి సపోర్ట్ చేస్తారు. మోదీని ఎవరు ఏ మాట అన్నా కూడా ఊరుకోరు. అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా నోటికొచ్చినట్లు తిట్టే్స్తారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ మోదీని ఫేసిస్ట్ అన్నారు. ఆయన అన్న మాటలను ఓ వెబ్‌సైట్ ప్రచురించింది. ఈ ఆర్టికల్‌ను ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ రంగోలీని ట్యాగ్ చేసారు. దీనిపై రంగోలీ స్పందిస్తూ.. ‘జావేద్ అక్తర్ గారు ఓ సారి నా చెల్లి కంగనకు ఫోన్ చేసి హృతిక్ రోషన్‌కి, మహేష్ భట్‌కి సారీ చెప్పాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. మహేష్ సినిమాలో కంగన సూసైడ్ బాంబర్ పాత్రలో నటించలేదని ఆమెపై చెప్పు విసిరాడు. ఈ విషయం కంగన మీడియా ముందు చెప్పిందని జావేద్ బెదిరించాడు. ఇప్పుడు చెప్పండి జావేద్ గారూ ఎవరు ఫేసిస్ట్ ఇక్కడ’’ అని ఇరికించారు. అంతేకాదు గత రెండు రోజులుగా ‘గల్లీ బాయ్’ సినిమాకు మాత్రం అవార్డ్స్ వచ్చాయని రంగోలీ సినీ నటులు ఆలియా భట్, రణ్‌వీర్ సింగ్, కరణ్ జోహార్‌లపై నోటికొచ్చిన కామెంట్స్ చేసింది. READ ALSO: కరణ్ జోహార్ తన తదుపరి సినిమా కోసం తనకు కావాల్సిన వారికే అవార్డులు ఇచ్చుకున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో రాఖీ సావంత్, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి.. లాంటివాళ్లే ఇలా ఇతరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆ తర్వాత లిస్ట్‌లో రంగోలీ కూడా చేరిపోయారు. ఇండస్ట్రీలో కంగన ఎన్నో అవమానాలు ఎదుర్కొందని, ఇప్పుడు తన గొప్పతనం గురించి ప్రజలకు తెలీకపోతే ఇంకెప్పటికీ తెలీదని అందుకే నిర్భయంగా తన భావాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటారని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V5fIya
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...