తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న నటుడు శ్రీకాంత్ను పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. తండ్రి మేక పరమేశ్వరరావు చనిపోయారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న పరమేశ్వరరావు నిన్న రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. శ్రీకాంత్కు చిరంజీవితో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ తండ్రి చనిపోయారని తెలీగానే హుటాహుటిన చిరు ఆయన ఇంటికి చేరుకున్నారు. పరమేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. శ్రీకాంత్ను, ఆయన కుటుంబీకులను పరామర్శించారు. పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వచ్చి సంతాపం తెలియజేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆయన పార్ధీవదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.పరమేశ్వరరావు 1948 మార్చి 16న కృష్ణాజిల్లా మేకావారిపాలెంలో జన్మించారు. అనంతరం వీరి కుటుంబం కర్ణాటకలోని గంగావతికి వలస వెళ్లింది. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. శ్రీకాంత్ కూడా గంగావతిలోనే జన్మించాడు. ధర్వాడ్లోని కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి బీకాం డిగ్రీ పూర్తిచేసిన శ్రీకాంత్.. తర్వాత సినిమాలపై మక్కువతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లోమా చేశారు. READ ALSO: ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించి నెమ్మదిగా హీరోగా మారారు. సురేశ్ ప్రొడక్షన్లో వచ్చిన తాజ్మహల్ సినిమా శ్రీకాంత్ కెరీర్ను మలుపుతిప్పింది. తర్వాత రాఘవేంద్రరావు పెళ్లిసందడి ఆయనను కథానాయకుడిగా మరో మెట్టుకు తీసుకెళ్లింది. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bFgHel
v
No comments:
Post a Comment