‘’ సినిమా పోస్టర్లపై జరుగుతున్న వివాదంపై స్పందించారు దర్శకుడు నరసింహ. అసలు సినిమా ఏంటో చూడకుండా కేసులు ఎలా పెట్టేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు జరగరానిది ఏదైనా జరిగితే అందరి వివరాలు బయటికి లాగుతానంటూ హెచ్చరించారు. ‘‘అసలు నా సినిమాలో తప్పు ఏముంది? నేను విడుదల చేసిన పోస్టర్లలో బూతులు ఎక్కడున్నాయ్. పోస్టర్ విడుదల చేయడానికి కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలన్న విషయం నాకు తెలీదు. తెలిసుంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకునేవాడిని. ‘అర్జున్ రెడ్డి’, ‘బాహుబలి’ సినిమాల పోస్టర్లకు కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉందా? ఒకవేళ వాటికి లేనప్పుడు నా సినిమాకు ఎందుకు? ఎవరో కాలేజ్ విద్యార్థులు పోస్టర్లు అసభ్యకరంగా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారట. దాంతో నన్ను మూడు గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. నాకెంత టైం వేస్ట్ అయిందో తెలుసా? ఈ సినిమాలో తమిళనాడుకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది. అలాంటప్పుడు సినిమాను ఎలా ఆపుతారు? ఒకవేళ నా సినిమాకు క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలని ఎవరైనా రచ్చ చేస్తే నేను అందరి బండారాలు బయటికి లాగుతా’’ READ ALSO: ‘‘ క్లియరెన్స్ సర్టిఫికేట్ లేకుండా విడుదలైన సినిమాల లిస్ట్ నా దగ్గర ఉంది. ఎవరో కావాలని నాపై ఈ కుట్ర పన్నారని నేను అనుకోను. ఎందుకంటే నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. చివరిగా నేను విద్యార్థులకు ఒక్కటే విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నేనూ విద్యార్థి దశ నుంచి వచ్చినవాడినే. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేలా సినిమాలు చేసే రకాన్ని కాను. ఓసారి సినిమా చూడండి. చూసాక ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. వెంటనే వాటిని తొలగించేస్తాను. అంతేకానీ ఏమీ తెలీకుండా ఇలా కేసులు పెట్టేసి ఇతరుల సమయాన్ని వేస్ట్ చేయొద్దు’ అని వెల్లడించారు నరసింహ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S2jrdD
v
No comments:
Post a Comment