Tuesday, 18 February 2020

సెన్సార్ బోర్డు సభ్యురాలి చేత బూతు సీన్లున్న ట్రైలర్ లాంచ్ చేయించారు: జీవిత రాజశేఖర్

తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదమైన ‘డిగ్రీ కాలేజ్’ ఆ తర్వాత మంచి టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌లో మాత్రం వల్గర్ సీన్లు మితిమీరిపోయాయి. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటి, సెన్సార్ బోర్డు సభ్యురాలు చేత లాంచ్ చేయించారు. అయితే గెస్ట్‌గా పిలిచారు కదా అని ఒక్క క్షణం ఆలోచించకుండా జీవిత ట్రైలర్ లాంచ్ వేడుకకు వెళ్లారు. కానీ ట్రైలర్ చూసాక ఆమె షాకయ్యారు. ఎక్కువగా వల్గర్ సీన్లు ఉండడంతో ఆమె కంగుతిన్నారు. ‘నేను సెన్సార్ బోర్డు సభ్యురాలిని, నా చేత ఇలాంటి సినిమా ట్రైలర్ ఎలా లాంచ్ చేయించారు’ అని స్టే్జ్ మీదే అనేసారు. ఆ మాట చాలా వైరల్ అయింది. ఇప్పుడు ‘రాహు’ అనే సినిమా టీజర్‌ లాంచ్‌కు వెళ్లారు. అక్కడ టీజర్ గురించి మాట్లాడుతూ.. ‘రాహు సినిమా టీజర్ లాంచ్‌కు పిలిచినప్పుడు ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ముందుగానే కొన్ని క్లిపింగ్స్ చూసాను. ఎందుకైనా మంచిది అని నిర్మాత మధుర శ్రీధర్ గారితో మాట్లాడాను. ఎందుకంటే డిగ్రీ కాలేజ్ ట్రైలర్ లాంచ్‌కి వెళ్తే సెన్సార్ బోర్డు సభ్యురాలికే బూతు సీన్స్ ఉన్న ట్రైలర్ చూపించారు. గౌరవమైన పదవిలో ఉన్న నా చేత అలాంటి ట్రైలర్ లాంచ్ చేయించారేంటి అన్నాను’’ READ ALSO: ‘‘ఆ మాట చాలా వైరల్ అయింది. ఇదే మాట నేను శ్రీధర్ గారితో అంటే... మేడమ్ నన్ను ఆ ప్రశ్న ఎలా అడుగుతారు అన్నారు. ఆయనపై నమ్మకంతో టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చాను. టీజర్ చూసాను. నచ్చింది. ఇలాంటి టైటిల్స్ పెడితే జనాల్లో ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే జనాలు కూడా ఇలాంటి వాటిని బాగా నమ్ముతారు. నేనైతే నమ్మను. కానీ మావారు బాగా నమ్ముతారు. ఆయన మంగళవారం రోజున పుట్టాడు కాబట్టి ఏ మంచి పని చేయాలనుకున్నా అదే రోజున చేస్తారు. నేనైతే అవేమీ పట్టించుకోను. రాహు సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HAI2jL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...