తమిళ నటుడు, దళపతి విజయ్ హీరోగా నటించిన ‘బిగిల్’ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాలపై బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన మదురైకు చెందిన నిర్మాత, ఫైనాన్షియర్ అంబు చెళియన్ ఇల్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, చిత్ర హీరో విజయ్ను విచారించారు. చెన్నైలోని ఆయన రెండు ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ‘బిగిల్’ టీంపై ఐటీ సోదాలు తమిళనాట హాట్ టాపిక్గా మారింది. బుధవారం చెన్నై, మదురైలో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు గురువారం కూడా ఈ సోదాలను కొనసాగించారు. మొత్తం 38 చోట్ల సోదాలు నిర్వహించినట్టు ఐటీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంటేకాదు, ఫైనాన్షియర్ అంబు చెళియన్కు చెందిన 77 కోట్ల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా లెక్కల్లో లేని సొమ్మని పేర్కొన్నారు. మదురై, చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈ డబ్బును రహస్యంగా దాచిపెట్టినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. Also Read: విజయ్ హీరోగా కిందటేడాది విడుదలైన ‘బిగిల్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది. అయితే, వసూలైన మొత్తానికి ఏజీఎస్ సంస్థ చెల్లించిన ట్యాక్స్కు పెద్ద మొత్తంలో తేడా ఉండటంతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం చెన్నైలోని ఏజీఎస్ గ్రూప్నకు చెందిన అన్ని కార్యాలయాల్లో సోదాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో హీరో విజయ్ రెమ్యునరేషన్ ఎంతనే విషయంపై ఐటీ అధికారులు ఆరా తీశారు. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి వారు నేరుగా విజయ్ వద్దకే వెళ్లారు. Also Read: నెయ్వేలిలో జరుగుతున్న ‘మాస్టర్’ షూటింగ్లో ఉన్న విజయ్ను కలిసిన ఐటీ అధికారులు ఆయన్ని సుధీర్ఘంగా ప్రశ్నించారు. నెయ్వేలి నుంచి ఆయన్ని రోడ్డు మార్గంలో చెన్నైకి తీసుకొచ్చారు. విజయ్ సమక్షంలోనే చెన్నైలోని ఆయన రెండు ఇళ్లలో సోదాలు జరిగినట్టు సమాచారం. విజయ్, ఏజీఎస్ సంస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఫైనాన్షియర్ అంబు చెళియన్కు చెందిన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో పాటుగా కొన్ని కీలకమైన పత్రాలు, భూములకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2vdGwRC
v
No comments:
Post a Comment