Friday, 24 January 2020

Saaho: ‘‘సాహో సినిమా నన్ను కోపిష్ఠిగా మార్చేసింది’’

విలన్ పాత్రల్లో నటించడం అంత ఈజీ కాదని అంటున్నారు బాలీవుడ్ నటుడు . యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాలో చుంకీ విలన్ పాత్రలో నటించారు. 2017లో వచ్చిన ‘బేగమ్ జాన్’ సినిమాలో అయితే మరీనూ. కరుడుగట్టిన కామాంధుడిలా కనిపించారు. అయితే ఈ పాత్రల్లో నటించడం వల్ల తనపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు చుంకీ. ‘సాహోలో నాది విలన్ పాత్ర. నా ఆలోచనలన్నీ క్లిష్టంగా ఉంటాయి. ‘బేగమ్ జాన్’ సినిమాలో దేవ్‌రాజ్‌ అనే విలన్ పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే నేను ఓ వంద సార్లు చనిపోయి బతికినట్లుగా చూస్తారు. ఎప్పుడూ హ్యాపీగా జోవియల్ పాత్రల్లో నటిస్తూ వస్తున్న నాకు ఒక్కసారిగా విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టాను. ఇది నాకు ఛాలెంజ్ అనే చెప్పాలి. విలన్ పాత్రలో నటించాల్సి వస్తే ఒంటరిగా గడపాలని చూసేవాడిని. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా సీరియస్‌గా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. ఫలితంగా నాలో కోపం, చిరాకు ఎక్కువ అయిపోయాయి. అసలు నేను ఇలా ఉండే మనిషిని కాను. అయితే ఇలాంటి పాత్రల వల్ల నేను చాలా నేర్చుకున్నాను. జీ సినిమాలో 26న సాహో ప్రసారం కాబోతోంది. మేం ఈ సినిమా చేస్తున్నంత సేపు ఎంత ఎంజాయ్ చేశామో ప్రేక్షకులు కూడా సినిమా చూసి అంతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను’ అని తెలిపారు. READ ALSO: ‘సాహో’ సినిమాను సుజీత్ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది ఆగస్ట్ 15న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఫ్యాన్స్ ఆశించినంత స్థాయిలో సినిమా ఆడలేకపోయింది. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2sUdyWg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...