‘మీకు నాకు ఎటువంటి రక్త సంబంధం లేదు.. కాని మీ అభిమానం నన్ను సూపర్ స్టార్ని చేసింది. సినిమా నన్ను పరిచయం చేస్తే.. టీవీ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ని చేసింది. జీ తెలుగు మీకు నాకు మధ్య వారధి’ అంటూ ఆ ఛానల్స్లో ప్రసారం కాబోయే సీరియల్స్ను ప్రమోట్ చేస్తూ చేసిన యాడ్ యూట్యూబ్లో వైరల్ అవుతోంది. ‘త్రినయని’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ ఇలా త్వరలో జీ తెలుగులో ప్రసారం కాబోయే వరుస సీరియల్స్ను యాంకర్ ప్రదీప్తో కలిసి ‘కొత్త బంధాలతో మన జీ తెలుగులో ఇక పెద పండగే’ అంటూ ఎమోషనల్ డైలాగ్లు చెప్తున్నారు మహేష్ బాబు. photo courtesy zee telugu ఇక బుల్లితెర ప్రేక్షకులు అయితే మహేష్ బాబు ఈ సీరియల్స్ని ప్రమోట్ చేయడాన్ని ఆహ్వానిస్తూ వెయిటింగ్ అంటుంటే.. ఈ యాడ్పై ట్రోల్స్కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ‘మామూలుగానే జనాలు సీరియల్ కి బానిసై పోయారు. మీరు ప్రమోట్ చేస్తే ఇంకేలా ఉంటుందో మరి ‘సరిలేరు నీకెవ్వరు’ మహేషా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇదిగో ఇలా ఈ ప్రోమోను ఓ రేంజ్లో వాడేస్తున్నారు. మహేష్ ‘సీరియల్’ డైలాగ్లకు హీరో నాని గుక్కపెట్టి ఏడుస్తుంటే.. కింగ్ నాగార్జున పాపం బ్రహ్మానందాన్ని ఫుడ్ బాల్ ఆడేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37h1woL
v
No comments:
Post a Comment