Wednesday, 1 January 2020

శ్రీరెడ్డి కొత్త బిజినెస్.. యాక్టర్స్, యాంకర్స్ కావాలట!

టాలీవుడ్‌లో వివాదాలకు కారణమై ప్రస్తుతం చెన్నైలో ఉంటోన్న నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో గంటగంటకు పోస్టులు పెడుతూ తన అభిమానులకు మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోంది. అలాగే, టాలీవుడ్ ప్రముఖులపై కూడా సెటైర్లు, విమర్శలు చేస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో శ్రీరెడ్డి పేరుమీద ఒక ఛానెల్‌ను నడిపిస్తోంది. పలు ఘటనలపై తన అభిప్రాయాలను తెలిపే వీడియోలను అందులో పోస్ట్ చేస్తోంది శ్రీరెడ్డి. అయితే, శ్రీరెడ్డి ఇప్పుడు మరో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త యూట్యూబ్ ఛానెల్‌ను ప్రకటించింది ఈ వివాదాస్పద నటి. నిధి ఎంటర్‌టైన్మెంట్స్ పేరిట పెడుతోన్న ఈ యూట్యూబ్ ఛానెల్ తమిళంలో ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్‌లో పనిచేయడానికి సిబ్బంది కావాలంటూ శ్రీరెడ్డి ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ ప్రకటనను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. Also Read: ఈ ఛానెల్‌లో పనిచేయడానికి యాక్టర్స్, యాంకర్స్ కావాలని ప్రకటనలో పేర్కొంది. యాక్టర్స్, యాంకర్స్ పోస్టుల కోసం స్త్రీ, పురుషులిద్దరూ అప్లై చేయొచ్చు. వయసు 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలట. అలాగే.. కెమెరామేన్, ఎడిటర్, కంటెంట్ రైటర్ కూడా కావాలని ఇదే ప్రకటనలో శ్రీరెడ్డి పేర్కొంది. ఇంటర్నషిప్ ఇవ్వడం ద్వారా యువతకు కూడా అవకాశాలు కల్పిస్తామని శ్రీరెడ్డి హామీ ఇచ్చింది. ఆసక్తి ఉన్నవారు ప్రొఫైల్స్‌ను ఈమెయిల్ చేయాలని మెయిల్ ఐడీ కూడా ఇచ్చింది. మొత్తానికి హైదరాబాద్ నుంచి చెన్నైకు మకాం మార్చిన శ్రీరెడ్డి ఈ కొత్త సంవత్సరంలో కొత్త బిజినెస్‌ను ప్రారంభించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Fas3b1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...