Tuesday, 21 January 2020

నాగశౌర్యకు పూరి జగన్నాథ్ సపోర్ట్

యంగ్ హీరో నాగశౌర్య తొలిసారి పూర్తిస్థాయి మాస్ సినిమా చేస్తున్నారు. అదే ‘అశ్వథ్థామ’. ఈ సినిమాకు ఆయనే కథ అందించారు. రమణతేజ అనే దర్శకుడుని ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా మూల్పూరి నిర్మించారు. ఈనెల 31న సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల మీదుగా ‘అశ్వథ్థామ’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. గురువారం సాయంత్రం 5.04 గంటలకు ‘అశ్వథ్థామ’ ట్రైలర్‌ను పూరి విడుదల చేయనున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. సమాజంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమా తెరకెక్కిందని చెప్పారు. Also Read: ఇదిలా ఉంటే, ‘ఛలో’ తరవాత నాగశౌర్య ఆ స్థాయి హిట్ అందుకోలేదు. ఆయన హీరోగా 2018లో వచ్చిన ‘కణం’, ‘అమ్మమ్మగారి ఇల్లు’, ‘నర్తనశాల’ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. కిందటేడాది వచ్చిన ‘ఓ బేబీ’ హిట్టయినా అందులో నాగశౌర్య పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. దీంతో ప్రస్తుతం నాగశౌర్య ఆశలన్నీ ‘అశ్వథ్థామ’ మీదే ఉన్నాయి. హిట్టుకొట్టాలనే కసితో ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. మనోజ్ రెడ్డి కెమెరామెన్‌గా పరిచయం అవుతున్నారు. గ్యారీ ఎడిటర్. పరుశురాం శ్రీనివాస్ డైలాగులు రాశారు. అన్బరివ్ యాక్షన్ డైరెక్టర్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RfedLc
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...