అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురములో. సంక్రాంతి బరిలో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా తొలి రోజు 85 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. సినిమాలోని కంటెంట్కు పాజిటివ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా మోత మోగిపోతోంది. తాజాగా ఈ లిస్ట్లోకి మరో స్టార్ హీరో చేరిపోయాడు. అల్లు అర్జున్ మామయ్య, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లవర్ బొకేను పంపించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. Also Read: బన్నీ అయితే ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషనేపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బన్నీకి ఫ్లవర్ బోకే పంపిన పవన్, ఆ బోకే తో పాటు ఓ సందేశాన్ని పంపించాడు. గౌరవనీయులైన అల్లు అర్జున్ గారు, అల వైకుంఠపురములో సినిమాలో ఘనవిజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరు చేయబోయే సినిమాలకు ఆల్ ది బెస్ట్` అంంటూ తానే స్వయంగా ఓ లెటర్ రాసి పంపించాడు. అయితే ఈ లెటర్ను ట్విటర్లో పోస్ట్ చేసిన బన్నీ `పవన్ కళ్యాన్ గారి నుంచి శుభాకాంక్షలు రావటం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్యూ వెరీ మచ్ పవన్ కళ్యాన్ గారు` అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. మామ అల్లుళ్లు ఇలా మీరు, గారు అంటూ సంబోధించుకోవటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల ప్రతిరోజు పండగే సినిమా సక్సెస సందర్భంగా సాయి ధరమ్ తేజ్కు శుభాకాంక్షలు పంపని పవన్, సాయిని కూడా ఇలాగే సంభోందించాడు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36QVpYl
v
No comments:
Post a Comment