Sunday, 19 January 2020

ఫ్యాన్స్ కల నెరవేరింది.. బాలీవుడ్‌లో అడుగుపెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడనే కాదు బాలీవుడ్‌లోనూ ఈ కుర్ర హీరోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. విజయ్ ముంబయిలో ఎప్పుడు అడుగుపెట్టినా అక్కడి ఫొటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ వెలకం భాయ్ అంటూ స్వాగతిస్తుంటారు. అయితే బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఆ వార్తలు ఈరోజు నిజమయ్యాయి. తమ అభిమాన నటుడ్ని జాతీయ స్థాయి స్టార్‌గా చూడాలని కలలు కన్న ఫ్యాన్స్ కల నెరవేరింది. విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాకు పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌తో చేతులు కలపడానికి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళంలోనే కాకుండా హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు నుంచి ముంబయిలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. READ ALSO: సినిమాకు ఛార్మీ క్లాప్ కొట్టారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్‌ల్యాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘జై లవకుశ’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన రోనిత్ రాయ్ కూడా ఇందులో నటిస్తున్నారు. అయితే హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. చాలా కాలంగా జాన్వి కపూర్ పేరు వినిపిస్తోంది. సినిమా కోసం పూరీ జగన్నాథ్ జాన్విని తీసుకోవాలని ఆమె తండ్రి బోనీ కపూర్‌తో మాట్లాడారని వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uc93XA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...