Thursday, 9 January 2020

విజయ్ దేవరకొండ కోసం అంత బడ్జెటా? ఏం పర్వాలేదంటున్న పూరీ

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరోసారి తన సత్తాను ప్రేక్షకులకు రుచి చూపించారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌ తగ్గడానికి ముందే టాలీవుడ్‌ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాను అనౌన్స్ చేసేశారు. సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్‌ను కూడా ఓకే చేసేశారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. అయితే మొదట ఈ సినిమాను 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించారట. అయితే ఇప్పుడు ఆ బడ్జెట్‌ అలా అలా పెరుగుతూ పోతోందట. ఎందుకంటే సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించాలని పూరీ నిర్ణయించుకున్నారు. ఇందులో హీరోయిన్‌గా జాన్వి కపూర్‌ను ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇందుకు జాన్వి తండ్రి బోనీ కపూర్‌తో కూడా మాట్లాడారని తెలుస్తోంది. అంతేకాదు సినిమాకు సౌత్ మ్యూజిక్ డైరెక్టర్లను కాకుండా బాలీవుడ్‌ నుంచి తెప్పించుకోవాలని అనుకుంటున్నారు. అక్కడి నుంచి హీరోయిన్‌, మ్యూజిక్ డైరెక్టర్‌ను తెచ్చుకోవాలంటే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా ఫర్వాలేదని బడ్జెట్ పెంచేస్తున్నారట పూరీ జగన్నాథ్. అయితే ఇదంతా అనవసర ఖర్చు అని ఆయన అనుకోవడంలేదట. READ ALSO: లాంటి క్రేజీ స్టార్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఆమాత్రం ఉండాల్సిందేగా అని ఆయన అభిప్రాయం. బడ్జెట్ ఎక్కువయినా సినిమా రిలీజ్ అయ్యాక అంత ఎందుకు ఖర్చు పెట్టామన్న రిగ్రెట్ అస్సలు ఉండదని పూరీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాశీ ఖన్నా, కేథరీన్ థ్రెసా, ఇసబెల్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు షాకింగ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరేమో అర్జున్ రెడ్డిలా ఉందని, మరికొందరేమో విజయ్ టూమచ్ రొమాన్స్ ఉన్న సినిమాలు తీస్తున్నారని అన్నారు. ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36ACzV2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...