పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచి భారతీయులపై నోరుపారేసుకుంటూనే ఉన్నారు . తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలపై లేనిపోని ఆరోపణలు చేశారు. పాకిస్థాన్లో అత్యాచారాలు జరగడానికి, అక్కడి ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిస అవడానికి కారణం బాలీవుడ్, హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలేనట. ‘‘మన దేశంలో మొబైల్ ఫోన్లు ఓ ఛాలెంజ్గా మారిపోయాయి. ఫోన్లు విరివిగా లభ్యం అవుతుండడంతో పిల్లలకు కావాల్సినంత కంటెంట్ దొరకుతోంది. ఆ ఫోన్ల వల్లే పిల్లలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పాఠశాలల్లో మాదక ద్రవ్యాలకు అలవాటుపడుతున్నారు. నాకు ఈ విషయం గురించి మొదట్లో ఏమీ తెలీలేదు కానీ ప్రధానిని అయ్యాక అసలు సమస్య అర్థమైంది. పాకిస్థాన్లో సెక్స్ క్రైం కూడా పెరిగిపోతోంది. ఇది చాలా బాధాకరం. ఇక్కడ మనం మరో విషయం గురించి కూడా చర్చించుకోవాలి. మనకు ఫోన్లలో లభ్యమయ్యే కంటెంట్ హాలీవుడ్, బాలీవుడ్ నుంచే వస్తోంది. మానవాళికి ఎంతో ప్రమాదకరమైన వెస్ట్రన్ కల్చర్కు మనం ఎక్కువగా అలవాటు పడిపోతున్నాం. బాలీవుడ్, హాలీవుడ్ వల్లే కాపురాలు కూలిపోతున్నాయి’ అన్నారు. READ ALSO: ఇమ్రాన్ అర్థంపర్థంలేని వ్యాఖ్యలపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన మాట్లాడింది ఆయనకైనా అర్థం అయిందా అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ సినిమాల వల్ల పాకిస్థాన్ చెడిపోతున్నప్పుడు ఇక్కడి సినిమాలను ఎందుకు చూడాలని అంటున్నారు. బాలీవుడ్ సినిమాల కంటే పాక్ చిత్ర పరిశ్రమలో తెరకెక్కే సినిమాల్లోనే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30NFGHm
v
No comments:
Post a Comment