Saturday, 11 January 2020

బన్నీకి చెర్రీ విషెస్.. అంటే గొడవలు లేనట్టేగా!

అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడైన అల్లు అర్జున్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లకుండా.. సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్‌కు వెళ్లడంతో ప్రేక్షకుల్లో చర్చ ఇంకాస్త పెరిగిపోయింది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పకనే చెప్పారు అల్లు అర్జున్ బావ, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్. బన్నీ సినిమా విడుదల అయిన సందర్భంగా విషెస్ చెప్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘నా బ్రదర్ అల్లు అర్జున్, త్రివిక్రమ్, పూజా హెగ్డే, పీఎస్ వినోద్‌, ‘అల వైకుంఠపురములో’ టీంకు ఆల్ ది బెస్ట్. సినిమాను థియేటర్స్‌లో మాత్రమే చూడండి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే మొన్న ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు రానందుకే రెండు కుటుంబాల మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతున్న రోజు కూడా ఎవ్వరూ స్పందించకపోతే ఆ రూమర్స్ నిజమే అనుకుంటున్నారన్న భయంతో రామ్ చరణ్ బన్నీకి విషెస్ చెప్పి ఉండొచ్చు. READ ALSO: రామ్ చరణ్ విషెస్‌ చెప్పిన తీరును చూస్తే కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్లు ఉందే తప్ప ప్రేమతో వచ్చిన మాటలుగా అనిపించడంలేదు. గతంలో అల్లు అర్జున్‌కి, తండ్రి అల్లు అరవింద్‌కి మధ్య గొడవలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. దీని గురించి అప్పట్లో బన్నీ స్పందిస్తూ ఆ వార్తలు చదివి తాను, తన తండ్రి పడి పడి నవ్వుకున్నామని అన్నారు. అదే విధంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు అన్న విషయంలో ఎలాంటి నిజం లేకపోయి ఉండొచ్చు అన్న వార్తలూ వినిపిస్తున్నాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35EjHmU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...