సాధారణంగా సినిమా యూనిట్లోని ప్రతి ఒక్కరు తమ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని, అందరూ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నా సినిమా చూడాలని కోరుతుంటారు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం తన సినిమా విషయంలో విభిన్నంగా స్పందించాడు. కొంతమంది తన సినిమాను అస్సలు చూడవద్దని తానే స్వయంగా ప్రచారం చేస్తున్నాడు. కోలీవుడ్లో హీరోగా నిలదొక్కకునేందుకు ప్రయత్నిస్తున్న యంగ్ హీరో హీరోగా తెరకెక్కుతున్న సినిమా సైకో. థ్రిల్లర్ చిత్రాల దర్శకుడు మిస్కన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పిశాచి, తుప్పారివాలన్ ( తెలుగులో డిటెక్టివ్) చిత్రాలను తెరకెక్కించాడు మిస్కిన్. దీంతో సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. Also Read: ఇటీవల లెజెండరీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. షాకింగ్ విజువల్స్తో రూపొందించిన ఈ టీజర్లో వయలెన్స్ పాళ్లు కాస్త శృతిమించాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే మిస్కిన్ స్టైల్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం టీజర్ సూపర్ అన్నారు. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా హీరోగా ఉదయనిధి స్థాలిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము తెరకెక్కించిన సైకో సినిమాను చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు చూడవద్దని చెప్పాడు. ఇదో ఎక్స్పరిమెంటల్ సినిమా అన్న ఉదయనిధి, మా సినిమా అన్ని వర్గాల కోసం తీసిన చిత్రం కాదని ఓపెన్గా చెప్పేస్తున్నారు. అయితే ఇది కూడా ఒక రకమైన ప్రమోషన్ స్ట్రాటజీ అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. Also Read: ఉదయనిధి స్టాలిన్ ఇంట్రస్టింగ్ క్యారెక్టర్లో కనిపిస్తున్న ఈ సినిమాలో నిత్యమీనన్, అదితిరావ్ హైదరీలు పోటి పడి నటించారు. ఇక టీజర్లో ఓ వ్యక్తిని వెనుక నుంచి న్యూడ్గా చూపించారు. ఈ సినిమాకు లెజెండరీ టెక్నిషియన్స్ పనిచేయటం విశేషం. ఇళయరాజ సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాదు ఈ సినిమా నిర్మాణ సంస్థ పేరు కూడా అంతే డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాను డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ అనే బ్యానర్పై అరుణ్ మోలి మాణిక్యం నిర్మిస్తున్నారు. ప్రస్తులం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RFcC0m
v
No comments:
Post a Comment