సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం . ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. చాలా కాలం తరువాత మహేష్ లోని కామెడీ యాంగిల్ను తెరమీద చూపిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. `జూలై 5న ఈ మెమరబుల్ జర్నీని ప్రారంభించాను. డిసెంబర్ 18న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ పూర్తయ్యింది`. ఈ సంక్రాంతి సినీ ప్రియులందరికీ గుర్తుండిపోతుంది` అంటూ ట్వీట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. Also Read: మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్కు మంచి రెస్సాన్స్ వచ్చింది. Also Read: ఈ సినిమా మ్యూజిక్ మాత్రం నిరాశపరుస్తోంది. తొలి పాట మైండ్ బ్లాక్ విషయంలో దారుణమైన విమర్శలు వినిపించాయి. తరువాత రిలీజ్ అయిన సూర్యుడివో చంద్రుడిదో, హీ ఈజ్ సో క్యూట్ పాటలు పరవాలేదనిపించాయి. దీంతో దేవీ శ్రీ ప్రసాద్పై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2rZAG5a
v
No comments:
Post a Comment