Tuesday, 17 December 2019

రాశీ ఖన్నా పాడిన ‘కనుబొమ్మే’ పాట.. తేజూ నంబన్ చితక్కొట్టాడు!

తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో సింగర్‌గా కూడా మారారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో రాశి హీరోయిన్. అయితే, రాశీతో సంగీత దర్శకుడు తమన్ మంచి డాన్స్ నంబర్‌ను పాడించారు. ‘‘కనుబొమ్మే నువు కనబడితే సరి కలలెగరేసునుగా’’ అంటూ సాగే ఈ వెస్ట్రన్ టైప్ సాంగ్‌ను రాశీ అద్భుతంగా పాడారు. దీపుతో కలిసి రాశీ పాడిన ఈ పాటకు రాహుల్ నంబియార్ వోకల్స్ పాడారు. శ్రీజో సాహిత్యం అందించారు. నిజానికి సాయి ధరమ్ తేజ్‌కు ఇప్పటి వరకు ఇలాంటి సాంగ్ పడలేదు. ‘సరైనోడు’ సినిమాలో బన్నీ కోసం ఇచ్చిన ట్యూన్ టైపులో డాన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ తమన్ ఈ అదిరిపోయే ట్యూన్‌ను కంపోజ్ చేశారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వహించడం మరో విశేషం. ఈ పాటతో కలుపుకుని ఇప్పటి వరకు ‘ప్రతిరోజూ పండగే’ ఆల్బమ్ నుంచి ఐదు పాటలు విడుదలయ్యాయి. అన్నీ సూపర్ హిట్ సాంగ్సే. తమన్ తనకు బెస్ట్ ఫ్రెండ్, నంబన్ అని తేజూ చెప్తుంటారు. అందుకే, తన మిత్రుడికి ఎలాగైనా మంచి ఆల్బమ్ ఇవ్వాలని తమన్ అన్నీ పాటలను అద్భుతంగా స్వరపరిచారు. కాగా, మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సత్యరాజ్ హీరో తాతయ్య పాత్రలో నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, విజయ్ కుమార్, ప్రవీణ్, హరితేజ, మహేష్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35v2RaP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...