Tuesday, 10 December 2019

న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు: హీరో కార్తి

తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన తమిళ సినిమాలన్నీ తెలుగులోకి అనువాదమవుతున్నాయి. ఇటీవలే ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందకున్నారు కార్తి. ఇప్పుడు ‘దొంగ’గా ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో కార్తి వదిన, సూర్య భార్య జ్యోతిక కీలక పాత్రలో నటించడం మరో విశేషం. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై ‘దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. డిసెంబర్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాను హర్షిత మూవీస్‌ అధినేత రావూరి వి. శ్రీనివాస్‌ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే’’ అంటూ జ్యోతిక ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. ‘‘ఎలా ఉందిరా పెర్‌ఫార్మెన్స్‌.. న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు..’’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో కార్తి చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కథకి తగ్గ యాక్షన్‌ కూడా ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. Also Read: ట్రైలర్‌ చివర్లో.. ‘‘ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా.. ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్క..’’ అంటూ కార్తీ చెప్పే డైలాగ్‌ ఎమోషనల్‌గా అనిపించింది. మొత్తంగా చూసుకుంటే మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో కూడిన థ్రిల్లర్‌ను కార్తి ప్రేక్షకులను అందించబోతున్నట్టు అర్థమవుతోంది. జీతు జోసెఫ్ మరో హిట్టు కొట్టేలా ఉన్నారు. కాగా, ఈ సినిమాలో కార్తి సరసన నిఖిలా విమల్ హీరోయిన్‌గా నటించింది. గోవింద వసంత సంగీతం సమకూర్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38rGTan
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...