Wednesday, 11 December 2019

అన్నంత పనీ చేశాడు.. పురుగుల మందు తాగిన ‘నానిగాడు’ హీరో

తాను హీరోగా నటించిన సినిమాను థియేటర్‌లో విడుదల కాకముందే యూట్యూబ్‌లో పెట్టేశారని ‘నానిగాడు’ చిత్ర హీరో దుర్గాప్రసాద్ మంగళవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. సినిమాను యూట్యూబ్‌ నుంచి రేపటిలోగా తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. అతను అన్నంతపనీ చేశాడు. బుధవారం ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని హాస్పిటల్‌కు తరలించారు. దుర్గాప్రసాద్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మొత్తం 40 లక్షల రూపాయలు అప్పు చేసి ‘నానిగాడు’ సినిమా తీశామని హీరో దుర్గాప్రసాద్ ఇప్పటికే వెల్లడించాడు. ఎన్నో ఆశలతో తీసిన సినిమా విడుదలకు సిద్ధమవుతోందని ఎంతో సంతోషించామని.. కానీ, విడుదల కాకముందే యూట్యూబ్‌లో పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సినిమాకు సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని తెలిపాడు. రేపటిలోగా యూట్యూబ్‌లో సినిమాను తొలగించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని దుర్గాప్రసాద్ హెచ్చరించాడు. Also Read: ఇది చాలా చిన్న సినిమా. రెండేళ్ల క్రితం ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ చూస్తే ఇది అస్సలు క్వాలిటీ లేని సినిమా అని అర్థమవుతుంది. సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే మాత్రం ఇలాంటి సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం అవసరమా? ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకుని రెండేళ్లుగా విడుదల కోసం వేచి చూడటం ఎందుకు.. దీన్ని ఆసరాగా తీసుకొని ఎవడో సినిమాను యూట్యూబ్‌లో పెట్టేస్తే గుండెలు బాదుకోవడం ఎందుకు. ఆత్మహత్యకు యత్నించడం ఎందకు? ఇప్పటికైనా సినీ పెద్దలు కలుగజేసుకుని ఈ చిన్న హీరోకి సాయం చేయాలని పరిశ్రమకు చెందిన పలువురు కోరుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36lBakP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...