టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల తెలుగు సినిమా పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువరు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి కుంటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు. చెన్నైలోని గొల్లపూడి మారుతీరావు నివాసానికి వెళ్ళిన మెగాస్టార్ ఆయనకు నివాళులర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చిరు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిరంజీవితో పాటు నటి సుహాసిని, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గొల్లపూడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్. Also Read: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ``ఐ లవ్యు` సినిమా చేస్తున్నప్పుడు.. నేను డైలాగులు పలకటం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆ సినిమా కోసం ఆయన దగ్గర శిష్యరికం కూడా చేశాను. గొల్లపూడి గారు నాకు గురువు లాంటి వారు. తరువాత మేము ఇద్దరం కలిసి `ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య` సినిమాలో నటించాము. ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేనిది. సినీ పరిశ్రమకు ఆయనలేని లోటు తీర్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా` అన్నారు. గొల్లపూడి కుమారుడు విదేశాల్లో ఉండటంతో ఆయన వచ్చే వరకు అంత్యక్రియలు వాయిదా వేశారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని టీ నగర్ కన్నమ్మ పేట స్మశాన వాటిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు తరలి వస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PlwNR6
v
No comments:
Post a Comment