లేడీ సూపర్స్టార్ ఇండస్ట్రీలో తానేంటో నిరూపించేసుకున్నారు. అందుకే ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నయనతార భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల నయన్ తన ప్రియుడు, ప్రముఖ దర్శుకడు విఘ్నేష్ శివన్తో కలిసి కన్యాకుమారిలోని తిరుచెందూర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ బీజేపీ మాజీ ఎంపీ అయిన నరసింహన్ను నయన్ కలిశారట. ఆ సమయంలో నరసింహన్ మాటల మధ్యలో బీజేపీలో చేరితే బాగుంటుంది అన్నారట. దీనిపై నరసింహన్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘నేను నయనతార అనుకోని ఆలయంలో కలవలేదు. అనుకోకుండా ఇద్దరం అక్కడే ఉన్నాం. ఇటీవల నయన్ హైదరాబాద్ ఎన్కౌంటర్పై స్పందిస్తూ ఆడవాళ్లను కాపాడటానికి మరింత కఠినమైన చట్టం తేవాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి నేను నయన్తో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంలో చట్టాలు, నిబంధనలు కఠినంగా ఉన్నాయని చెప్పాను. అందుకే ఆమెను బీజేపీలో చేరితే బాగుంటుందని చెప్పాను. ఎందుకంటే సౌత్లో నయనతారకు ఓ స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆమె రాజకీయాల్లోకి వస్తే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఆమె ఆలోచనలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. అయితే నయన్ దీనిపై స్పందించకుండా కేవలం నవ్వి ఊరుకున్నాను’ అని తెలిపారు. అయితే నయన్కు రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆసక్తి ముందు నుంచీ లేదు. ఆమె సినీ రంగంలో ఉంటూనే మీడియా ముందు మాట్లాడటానికి ఒప్పుకోరు. అలాంటిది రాజకీయాల్లోకి వెళ్లి ప్రజల మధ్య నిలబడి ప్రసంగాలు చేస్తారనుకోవడం పొరపాటే. అదీకాకుండా నయన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అదీకాకుండా 2020లో విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నయన్ రాజకీయాల్లోకి వెళ్తారు అనడం కరెక్ట్ కాదనే చెప్పాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YJEjs8
v
No comments:
Post a Comment