ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా తండ్రి సూరజ్ మల్హోత్రా చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలీగానే సినీ ప్రముఖులంతా మనీష్ నివాసానికి వెళ్లారు. మనీష్ను ఓదార్చారు. సూరజ్కు నివాళులు అర్పించేందుకు వెళ్లిన వారిలో అలనాటి బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. ఆమె తన కూతురు శ్వేతాతో కలిసి మనీష్ ఇంటికి వెళ్లారు. అయితే జయా కారు దిగుతుంటే అక్కడే ఉన్న పలువురు ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోలు తీశారు. వచ్చిపోతున్న సినీ ప్రముఖుల ఫొటోలు తీస్తూనే ఉన్నారు. దాంతో జయా బచ్చన్కు ఒళ్లుమండింది. ‘ఎప్పుడు ఫొటోలు తీయాలో కూడా తెలీదా? చావుకు వెళుతుంటే ఫొటోలు తీయడానికి మర్యాద, సిగ్గు లేదా? మీ ఇంట్లో కూడా చావు జరిగినప్పుడు నేను వచ్చి ఫొటోలు తీస్తే మీకెలా ఉంటుంది?’ అని కేకలు వేశారు. ఆమె అరుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ విరాట్ భయానీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. దాంతో జయా ప్రవర్తనపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు తీయడమే వారి ప్రొఫెషన్ అయినప్పుడు జయ వారిని తిట్టకూడదంటూ బుద్ధి చెబుతున్నారు. మీడియాకు నీతులు నేర్పిన జయ.. మరో వీడియోలో నవ్వుతూ అడ్డంగా దొరికిపోయారు. మనీష్ ఇంటికి వచ్చిన కరీనా కపూర్ను చూడగానే జయ నవ్వుతూ పలకరించారు. మరి చావు జరిగిన ఇంట్లో నవ్వుతూ పలకరించుకోవడం ఎంత వరకు కరెక్టో ఆమెకే తెలియాలి అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ జయా ఇలా మీడియపై చాలా సార్లు కేకలు వేశారు. మనీష్ను ఓదార్చేందుకు బాలీవుడ్ ప్రముఖులు ఐశ్వర్యా రాయ్, జయా బచ్చన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, గౌరీ ఖాన్, కియారా అద్వానీ, రవీనా టాండన్, అర్జు్న్ కపూర్, ఫరా ఖాన్, శిల్పా శెట్టి, మలైకా అరోరా, రోహిత్ ధావన్, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ మల్హోత్రా, సోనాలి బింద్రే తదితరులు వెళ్లారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O0IOKZ
v
No comments:
Post a Comment