పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వేడుకల్లో కనిపించటం చాలా అరుదు. తన సినిమాలకు కూడా వేడుకలు నిర్వహించేందుకు ఇష్టపడని పవన్ మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలతో పాటు నితిన్ సినిమాల వేడుకల్లో ఒకటి రెండు సార్లు కనిపించాడు. అంతకు మించి ఇతర హీరోలకు కార్యక్రమాలకు హాజరైన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టొ్చ్చు. అయితే తాజాగా పవర్ స్టార్ ఓ బయోపిక్కు సంబంధించిన వేడుకకు హారయ్యేందుకు అంగీకరించాడు. విప్లవ నాయకుడి కథతో తెరకెక్కుతున్న సినిమా కావటంతో పవన్ అతిథిగా వస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు చిత్రయూనిట్. అదే ఉద్దేశంతో ఆయన్ను సంప్రదించటంతో పవన్ హాజరయ్యేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. Also Read: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా నాయకుడిగా ఎన్నో పోరాటాలు చేసి దారుణ హత్యకు గురైన కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. జార్జ్ రెడ్డి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అవుతుంది. నవంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also Read: ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 17న అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వేదిక ఎక్కడన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఈ వేడుకకు పవన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. విప్లవ భావాలున్న పవన్, ఓ విప్లవ నాయకుడి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్ కాస్టింగ్తో రిచ్గా సినిమాను రూపొందించారు. దళం ఫేం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో వంగవీటి ఫేం సందీప్ మాధవ్ (సాండీ) నటిస్తున్నాడు. ఈ సినిమాను మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి, సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. సంచలన విజయం సాధించిన మరాఠి సినిమా సైరత్కు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన సుధాకర్ యెక్కంటి సినిమాకు కెమెరామెన్గా పనిచేస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OgAi9R
v
No comments:
Post a Comment