బుధవారం ఉదయం నుంచి సినీ తారలే టార్గెట్గా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఉదయం నిర్మాత సురేష్కు ఇళ్లు, ఆఫీసులతో పాటు ఆయనకు చెందిన రామానాయుడు స్టూడియోను ఐటీ అధికారులు ఐటీ దాడులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అదే సమయంలో హీరో నాని ఆఫీసుపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. తెల్లవారు జామునే నాని ఆఫీస్కి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. హీరోగా మంచి ఫాంలో ఉన్న నాని ఇటీవల నిర్మాతగానూ మారిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ బ్యానర్ను స్థాపించిన నాని అ! సినిమాను నిర్మించాడు. Also Read: రెండో ప్రయత్నంగా ఫలక్నుమా దాస్ ఫేం విశ్వక్సేన్ హీరోగా ఓ సినిమాను ప్రకటించాడు. మరి కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నాని ఇంటిపై ఐటీ దాడులు జరగటం ఆసక్తికరంగా మారింది. అయితే దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సిందే. Also Read: నాని, సురేష్ బాబులతో పాటు నిర్మాత నాగవంశీకి చెందిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఆఫీసుల్లో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు టాలీవుడ్ ప్రముఖులకు చెందిన పది కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/330oAoP
v
No comments:
Post a Comment